తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది , ముఖ్యమంత్రి కి స్వయానా సోదరి అయిన విమలా భాయ్ (82) ఈరోజు హైదరాబాద్ లోని అల్వాల్ లో కన్నుమూసింది . గతకొంత కాలంగా అనారోగ్య బారిన పడిన విమలా భాయ్ కేసీఆర్ కు స్వయానా అక్క . ఈ ఉదయం ఆమె చనిపోవడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది. విమలా భాయ్ కుటుంబం అల్వాల్ లో నివసిస్తోంది .
కేసీఆర్ కు మొత్తం ఎనిమిది మంది అక్కలు ,ఒక చెల్లె కాగా విమలా భాయ్ రెండో అక్క . అల్వాల్ లోనే విమల అంత్యక్రియలు నిర్వహించనున్నారు . తన సోదరి మరణించడంతో కేసీఆర్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు .
- Advertisement -