Homeటాప్ స్టోరీస్50 లక్షల విరాళం ఇచ్చిన మహానటి యూనిట్

50 లక్షల విరాళం ఇచ్చిన మహానటి యూనిట్

CM Chandrababu Naidu appreciates Mahanati teamఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మహానటి చిత్ర నిర్మాతలు స్వప్న దత్ , ప్రియాంక దత్ లు 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు . ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన సందర్బంగా ఈ ప్రకటన చేసారు . మహానటి దిగ్విజయంగా ప్రదర్శిత మౌతున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందాన్ని సత్కరించాడు చంద్రబాబు నాయుడు . మహానటి గొప్ప చిత్రమని అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో మహానటి చిత్రానికి పన్ను రాయితీ కూడా కల్పించడానికి వెనుకాడబోమని అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానటి చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చాడు చంద్రబాబు .

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కలిసిన వాళ్లలో అశ్వనీదత్ తో పాటు చిత్ర దర్శకులు నాగ అశ్విన్ , స్వప్న దత్ , ప్రియాంక దత్ , హీరోయిన్ కీర్తి సురేష్ తదితరులు ఉన్నారు . మహానటి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేయడమే కాకుండా మెమొంటో లను అందించాడు చంద్రబాబు . అగ్ర నిర్మాత అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీ అభిమాని అన్న విషయం తెలిసిందే , విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయాడు కూడా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All