ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఏర్పటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చిత్రసీమలో మహిళలను గౌరవిస్తూ ..వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ, సోదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భాంగా చిరంజీవి మాట్లాడుతూ..తన తల్లి అంజనా దేవి, సతీమణి సురేఖలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక కుటుంబంలో మహిళలలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నతనంలో నాకోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా పక్షపాతిగా మారాను అని చెప్పాడు. ఇక నేను సక్సెస్ఫుల్ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే తీసుకుంది. దీంతో సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను.
అల్లు వారి ఇంట్లో ఆమె చిన్న బిడ్డ అని, గారాల పట్టి అని వెల్లడించారు. కానీ, తనను పెళ్లి చేసుకున్నాక తమ ఇంటికి పెద్ద కోడలు అయిందని అన్నారు. తనను పెళ్లి చేసుకున్నాక తన కుటుంబాన్ని ఆమే చూసుకుందని ప్రశంసించారు. అందుకే తాను సక్సెస్ ఫుల్ హీరోగా ఉండడానికి ఆమే కారణమని చెప్పుకొచ్చారు.