మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా కొనసాగుతున్నారు. దాసరి నారాయణ రావు గారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చిరు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటున్నాడు చిరు. ఇటీవలే జర్నలిస్ట్ కమ్ నటుడు టియన్నార్ చనిపోతే ఆయన కుటుంబానికి 1 లక్ష రూపాయలను అందించారు. అలాగే నటి పావలా శ్యామల కష్టాల్లో ఉందని తెలుసుకుని ఆమెకు కూడా 1 లక్ష రూపాయలను సహాయంగా అందించాడు.
ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండడంతో ప్రతీ జిల్లాలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాడు చిరంజీవి. దీనిపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటె చిరంజీవి చేసిన మరో మెగా సహాయం ఈరోజు అందరికీ తెలిసింది.
80,90 లలో ఫైట్ మాస్టర్ గా, నటుడిగా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. ఆ మధ్య ఆయనకు ఆరోగ్యం బాగోలేక కిడ్నీ శస్త్రచికిత్స చేయాలని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల రూపాయలను పంపించారట. ఈ విషయం బయట ఎక్కడా తెలీలేదు. ప్రస్తుతం కోలుకున్న పొన్నాంబళం తనకు కష్ట సమయంలో ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు.
Megastar @KChiruTweets transferred an amount of 2 Lakhs rupees to Artist #Ponnambalam for his kidney transplant operation. He thanked megastar for his timely help. ❤️ pic.twitter.com/y7Dk1rw6nf
— Vamsi Shekar (@UrsVamsiShekar) May 21, 2021