తమిళంలో ప్రముఖ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న వైరముత్తుపై కొన్ని నెలల క్రితం ప్రముఖ గాయనీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీటూ ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సారి వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. చిన్మయి ఆరోపణలపై వివాదం చెలరేగడంతో వైకముత్తు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తను ఎవరినీ వేధించలేదని వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. దాదాపు రెండేళ్ల తరువాత మరోసారి చిన్మయి సంచలన ఆరోణలు చూస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. చిన్మయికి ఓ యువతి వైరముత్తు చేసిన వేధింపుల గురించి మెసేజ్ చేయడంతో దానికి సంబంధించిన స్క్రిన్ షాట్స్ని సోషల్ మీడియాలో చిన్మయి షేర్ చేసింది.
తన పేరు బయటికి రాకూడదని చెబుతూనే వైరముత్తు తనని వేధించాడని ఓ యువతి చిన్మయితో వెల్లడించింది. తన కాలేజీ డేస్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణకు వైరముత్తు వచ్చారట. ఆ సమయంలో ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నానని, అయితే అతను తన ఫోన్ నంబర్ రాశారని, ఇలా ఎందుకు రాశారో తను తెలుసుకోలేకపోయానంది. కొన్నాళ్లకు ఓ ఛానల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడికి వైరముత్తు వచ్చారని, తన ఫోన్ నంబర్ తీసుకున్నారని, అప్పటి నుంచి తనకు రోజుకి 50 సార్లు ఫోన్ చేసేవారని, మెసేజ్లు పంపుతూ వేధించడం మొదలుపెట్టారని, అతని బుద్ధి తెలిసి షాకయ్యానని ఎన్ని నెంబర్లు మార్చినా తెలుసుకునేవాడని, అతని వేదింపులు భరించలేక ఛానల్ వారు వైరముత్తు భార్యకు విషయం చేరవేయడంతో తనకు వేధింపులు ఆగిపోయాయని స్పష్టం చేసింది.