Homeటాప్ స్టోరీస్హీరోపై సీరియస్ అయిన కోర్టు

హీరోపై సీరియస్ అయిన కోర్టు

chennai high court verdict against simbuతమిళ హీరో శింబు పై తమిళనాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది , నిర్మాత దగ్గర తీసుకున్న అడ్వాన్స్ వడ్డీతో సహా చెల్లించాలని లేదంటే నీ ఇల్లు , ఇతర ఆస్థులు జప్తు చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది . సంఘటన వివరాలలోకి వెళితే ……. 2013 లో ఫ్యాషన్ అనే కొత్త నిర్మాణ సంస్థ శింబు తో సినిమా నిర్మించాలని 50 లక్షలను అడ్వాన్స్ గా ఇచ్చింది , అయితే అప్పటి నుండి శింబు వాళ్లకు డేట్స్ ఇవ్వకపోవడంతో మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు శింబు నిరాకరించడంతో హైకోర్టు ని ఆశ్రయించారు .

కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం తక్షణం 50 లక్షలకు వడ్డీని కలుపుకొని మొత్తం 85 లక్షలను నిర్మాతకు ఇవ్వాల్సిందిగా శింబు ని ఆదేశించింది . ఒకవేళ శింబు సకాలంలో డబ్బు చెల్లించకపోతే ఇంటికి , ఇతర ఆస్థులను జప్తు చేయాలనీ ఆదేశించింది . శింబు కు నాలుగు వారాల గడువు ఇచ్చింది కోర్టు . ఇక ఇప్పుడు శింబు తక్షణం ఆ సొమ్ము చెల్లించాలి , మరి చెల్లిస్తాడా ? లేక మరోసారి కోర్టు ని ఆశ్రయిస్తాడా చూడాలి .
English Title: chennai high court verdict against simbu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All