ఆది సాయికుమార్ – శ్రద్దా శ్రీనాథ్ జంటగా విశ్వనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” జోడి ” . అయితే ఈ సినిమా పేరు తొలుత ” జోడి ” కాదని , ” ఈడు – జోడు ” అని అలాగే నేను 2 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పుడేమో సినిమా పేరు మార్చడమే కాకుండా నిర్మాతగా నా పేరు తీసేసి మరొకరి పేరు వేసారని దర్శకుడు విశ్వనాధ్ పై చీటింగ్ కేసు పెట్టింది నిర్మాత ఉప్పలపాటి అనురాధ . తనని మోసం చేసిన దర్శకుడికి తగిన శాస్తి జరగాలని అలాగే నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
జోడి చిత్ర ఫస్ట్ లుక్ ని ఇటీవలే రిలీజ్ చేసారు . అయితే అందులో నిర్మాతగా గుర్రం విజయలక్ష్మి అనే పేరు వేయడంతో తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది అనురాధ . గుర్రం విజయలక్ష్మి ని సహ నిర్మాతగా తీసుకున్నాం కానీ ఇప్పుడేమో ఏకంగా ఆ సినిమా నుండి నన్ను తప్పించి ఆమె ని నిర్మాతగా వేయడం దారుణమని బాధపడుతోంది . మరి ఈ వ్యవహారంలో విశ్వనాథ్ , గుర్రం విజయలక్ష్మి లు ఎలా స్పందిస్తారో చూడాలి .