విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . వంద కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఆ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు . దాంతో పరశురామ్ కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది . పరశురామ్ తో పలువురు హీరోలు , నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కట్టారు అయితే పరశురామ్ తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ కే చేయాల్సి ఉండటంతో సైలెంట్ అయ్యారు .
కట్ చేస్తే అఖిల్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు గీత ఆర్ట్స్ దాంతో పరశురామ్ అఖిల్ కు ఇటీవలే ఓ కథ చెప్పాడట అది అఖిల్ కు నచ్చడంతో అఖిల్ కు హిట్ ఇవ్వడానికి అల్లు అరవింద్ – పరశురామ్ పూనుకున్నారు అన్న వార్త వినబడుతోంది . అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో ఇప్పుడు గీత గోవిందం డైరెక్టర్ కు అగ్ని పరీక్ష లా తయారయ్యింది పరిస్థితి . అఖిల్ కు హిట్ ఇస్తే పరశురామ్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయం ఒకవేళ ప్లాప్ అయితే పరశురామ్ కు గడ్డు పరిస్థితే !
English Title: Challenge for geetha govindam director