నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగ ఈరోజు రిలీజ్ అవుతుండగా ఓవర్ సీస్ లో మాత్రం గతరాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి . మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకులు త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వాములు కావడం . కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఇక ఓవర్ సీస్ టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో తెలుసా ……
ఫస్టాఫ్ లో అందమైన ఫారిన్ లొకేషన్ల తో పాటుగా నితిన్ – మేఘా ఆకాష్ ల మధ్య నడిచే అందమైన రొమాన్స్ ఈ సినిమాకు చాలా ప్లస్ అని అలాగే నితిన్ ,మధు నందన్ , ప్రభాస్ శ్రీను ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్ టైన్ మెంట్ ని అందించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని టాక్ అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి కొన్ని సాధారణ సన్నివేశాలతో విసిగించినప్పటికీ …… సెకండాఫ్ ఫస్టాఫ్ స్థాయిలో లేకపోయినప్పటికీ నితిన్ స్టయిల్ , పవన్ కళ్యాణ్ సీన్స్ తో ఓవరాల్ గా చల్ మోహన్ రంగ ఫరవాలేదని అంటున్నారు . ఎక్కువగా ఊహించుకొని వెళితే ఇబ్బంది పడటం ఖాయమని సరదాగా వెళితే హాయిగా సినిమా చూడొచ్చని అంటున్నారు . ఇక ఇక్కడ సంగతి ఏంటి ? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే .
- Advertisement -