తెలంగాణ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 7న పోలింగ్ జరుగుతుండగా డిసెంబర్ 11 న ఓట్ల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఫలితాలు రావడానికి సమయం పడుతోంది కానీ ఈలోపు బోలెడు సర్వేలు వచ్చాయి . ఎవరి సర్వే వాళ్లకు అనుకూలంగా ఉండగా సెంట్రల్ ఇంటలిజెన్స్ సర్వే తాజాగా చేశారు. ఆ సెంట్రల్ ఇంటలిజెన్స్ సర్వే ప్రకారం తెలంగాణలో అధికారం చేపట్టే పార్టీ ఏంటో తెలుసా……. కాంగ్రెస్ -టీడీపీ కూటమి. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ సర్వే ఫలితం మాత్రం కాంగ్రెస్ – టీడీపీ దే పవర్ అని తేల్చిచెప్పింది.
119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 58 కి పైగా స్థానాలను దక్కించుకుంటుందని అధికార పక్షమైన టీఆర్ఎస్ కేవలం 29 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తేల్చారు సెంట్రల్ ఇంటలిజెన్స్ సర్వే వాళ్ళు. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెల్చుకుంటే గొప్ప అట.
ఎం ఐ ఎం కు 6 స్థానాలు , తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు , దక్కుతాయని అయితే ఒక 15 స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉందని వాటిలో కాంగ్రెస్ తో పాటుగా తెలుగుదేశం , టీఆర్ఎస్ కూడా గెలుపొందే అవకాశం ఉందని తేల్చారు. అంటే ఏ రకంగా చూసినా తెలంగాణలో కాంగ్రెస్ -టీడీపీ కూటమి దే అధికారం .
English Title: Breaking News: Congress will be win in Telangana