టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కత్రినా కైఫ్ ని నటింప జేయాలని చూస్తున్నారట దర్శకులు సుకుమార్ . ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నాడు . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .
దాంతో మరింత క్రేజ్ తీసుకురావడానికి మహేష్ సరసన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట సుకుమార్ . అనుకోవడమే తరువాయి కత్రినా ని కలిశాడట కూడా . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించనున్నారు . కత్రినా కైఫ్ ఇంతకుముందు బాలయ్య సరసన అల్లరి పిడుగు చిత్రంలో వెంకటేష్ సరసన మల్లీశ్వరి చిత్రంలో నటించింది తెలుగు చిత్రాల్లో . అయితే ఎక్కువగా మల్లీశ్వరి గానే గుర్తింపు పొందింది ఎందుకంటే అల్లరి పిడుగు అట్టర్ ప్లాప్ అయ్యింది .
English Title: Bollywood Hot Bomb Katrina Kaif with Mahesh Babu