ఫైనాన్షియర్ అగర్వాల్ దగ్గర అయిదు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో అతడు కోర్టుని ఆశ్రయించగా ఢిల్లీ కోర్టు హాస్య నటుడి ని దోషి గా తేల్చింది , మరో పదిరోజుల్లో శిక్ష ఖరారు చేయనుంది ఢిల్లీ కోర్టు . సంఘటన వివరాలలోకి వెళితే ……. రాజ్ పాల్ యాదవ్ అనే బాలీవుడ్ హాస్య నటుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు . అయితే సినిమా తీయాలని భావించిన రాజ్ పాల్ యాదవ్ తన భార్య రాధ తో కలిసి యాక్సిస్ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసాడు .
ఎం జి అగర్వాల్ వద్ద 5 కోట్లు సినిమా కోసం అప్పుగా తీసుకున్నారు అయితే తీసుకున్న అప్పు ని సకాలంలో అగర్వాల్ కు చెల్లించక పోవడంతో కోర్టు ని ఆశ్రయించాడు అగర్వాల్ . దాంతో ఢిల్లీ లోని కర్ కర్ డుమా కోర్టు అదనపు మేజిస్ట్రేట్ రాజ్ పాల్ యాదవ్ ని అతడి భార్య రాదని దోషులుగా తేల్చారు అయితే రాజ్ పాల్ యాదవ్ కు ఎలాంటి శిక్ష విధించనున్నారో మాత్రం ఏప్రిల్ 23న తేలనుంది . శిక్ష ఖరారు అయితే రాజ్ పాల్ యాదవ్ జైలు కెళ్ళడం ఖాయం .