Homeటాప్ స్టోరీస్తెలుగు హీరోయిన్‌ అపార్ట్మెంట్ సీజ్‌!

తెలుగు హీరోయిన్‌ అపార్ట్మెంట్ సీజ్‌!

తెలుగు హీరోయిన్‌ అపార్ట్మెంట్ సీజ్‌!
తెలుగు హీరోయిన్‌ అపార్ట్మెంట్ సీజ్‌!

క‌రోనా వైర‌స్ ఇండియాలో స్వైర విహారం చేస్తోంది. ఏ రాష్ట్రం తీసుకున్నా క‌రోనా కేసులే. ముంబై, చెన్నైల‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. అక్క‌డ వుంటున్న సినీ స్టార్స్ ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందా? అని భ‌యం భ‌యంగా గ‌డుపుతున్నారు. తాజాగా చెన్నైలో  ఉంటున్న తెలుగు హీరోయిన్ అపార్ట్మెంట్‌ని సీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలుగులో `ఆవ‌కాయ్ బిర్యాని` చిత్రంతో హీయిన్‌గా ప‌రిచ‌య‌మైంది బిందు మాధ‌వి. ఆ త‌రువాత తెలుగులో అవ‌కాశాల కోసం ప్ర‌త‌యత్నించినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో చెన్నైకి మ‌కాం మార్చేసింది. త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ అక్క‌డే వుంటోంది. తాజాగా ఆమె వుంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్య‌క్తికి కరోనా వైర‌స్ సోకిందట‌. దీంతో బిందు మాధ‌వి ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌ని మున్సిపాలిటీ సిబ్బంది సీజ్ చేశారు.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో బిందు మాధ‌వి కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బిందు మాధ‌వి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించ‌డంతో ఈ వార్త వైర‌ల్‌గా మారింది. `మేముంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మేమంతా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయాం` అని అపార్ట్‌మెంట్ వీడియోని షేర్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All