Homeటాప్ స్టోరీస్“భీష్మ” బుల్లితెరపై త్వరలో టెలికాస్ట్

“భీష్మ” బుల్లితెరపై త్వరలో టెలికాస్ట్

“భీష్మ” బుల్లితెరపై త్వరలో టెలికాస్ట్
“భీష్మ” బుల్లితెరపై త్వరలో టెలికాస్ట్

సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న అందరూ కలిసి ఇంటర్లో రెండు గంటలపాటు థియేటర్లో మనందరినీ కడుపుబ్బ నవ్వించి మరీ, ఒక మంచి కథ చెప్పి పంపించిన సినిమా “భీష్మ”. నితిన్ అభిమానులకైతే ఇంకా థియేటర్ లో చూసినట్టే ఉంది ఆ సినిమాని. కానీ అప్పుడే బుల్లితెరపై కూడా వచ్చేస్తోంది. అది ఈ నెల 24న.. ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లలో ఒకటైన సన్ ఎన్.ఎక్స్.టి వారు భీష్మ సినిమాను ఏప్రిల్ 24వ తేదీన ప్రసారం చేయబోతున్నారు.

ఇప్పటికే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ నెల 30 వరకు కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా పరోక్షంగా తమ డామినేషన్ చూపించిన ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. గట్టిగా మాట్లాడితే కొద్దిగా హైప్ వచ్చి రిలీజ్ బిజినెస్ అవుతుంది… అనుకున్న చిన్న సినిమాలను ఏకంగా ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొనడానికి సిద్ధమవుతున్నారు సదరు నిర్వాహకులు.

- Advertisement -

చిన్న సినిమాలకు బిజినెస్ దొరికి ప్రొడ్యూసర్ మరియు టీమ్ కు నష్టం లేకుండా సినిమా ప్రజలకు చేరితే మంచిదే..! కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని సినిమాలను మాత్రం థియేటర్ లలో రిలీజ్ కాకుండా  ప్రేక్షకుల ఆదరణ వారి అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొనడం అంటే చాలా ధైర్యం చేస్తున్నారనే చెప్పాలి. ఏది ఏమైనా థియేటర్లో భీష్మ సినిమా మిస్ అయిన వారు లేదా ఒకసారి చూసి మరొకసారి చూసే లోపు మిస్ అయిన వారు రిపీటెడ్ గా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మరొక 12 రోజుల్లో భీష్మ సినిమా చూసే అవకాశం కలుగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All