పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసాడు. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే అంతే సంగతి. మొదటి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్, రానా కలయికలో వచ్చిన భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ తర్వాత పవన్ నుండి వచ్చిన సినిమా కావడం , థమన్ మ్యూజిక్ సూపర్ సక్సెస్ కావడం, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్లనే తేడా లేకుండా సినిమా హాళ్లలో జన జాతర కొనసాగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 1900 థియేటర్లలో రిలీజ్ కావడం తో ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేసాయి. అమెరికాలో భీమ్లా నాయక్ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తొలి రోజు ముగియకముందే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఆస్ట్రేలియాలో 42 లక్షలు, న్యూజిలాండ్లో సుమారు 7 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఇక నైజాం లో రూ. 11.80 కోట్ల షేర్ ని అందుకొని ఆల్ టైం రికార్డు ను నమోదు చేసింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నారు. పవన్ సరసన నిత్యమీనన్ నటించగా.. రానా సరసన సంయుక్త నటించింది. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు.