Homeగాసిప్స్మరోసారి సాగర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్..?

మరోసారి సాగర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్..?

bheemla nayak combo will repeat
bheemla nayak combo will repeat

అప్పట్లో ఒకడుండేవాడు మూవీ తో హిట్ అందుకున్న డైరెక్టర్ సాగర్ కె చంద్ర ..రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ మూవీ ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మలయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రాన్ని తెలుగు లో భీమ్లా నాయక్ గా తెరకెక్కించారు. ఈ మూవీ కి సాగర్ డైరెక్ట్ చేయగా..త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ,మాటలు అందించడం విశేషం. గత వారం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని , కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో తెరపైకి మరోసారి వీరి కాంబో మూవీ రాబోతుందనే వార్త అభిమానుల్లో సంతోషం నింపుతుంది.

ఆ మధ్య తమిళ్ లో వచ్చిన వినోదాయ సిత్తం అనే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కబోతుందనే వార్తలు వినిపించాయి. కాగా అయ్యప్పనుమ్ కోషియమ్ ను ఎలాగైతే భీమ్లానాయక్ గా మార్చాడో.. అలాగే వినోదాయ సిత్తం ను కూడా పవన్ స్టయిల్, ఇమేజ్ కు తగ్గట్టు మార్చమని త్రివిక్రమ్ ను కోరారట. త్రివిక్రమ్ సైతం అందుకు ఓకే చెప్పినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు విన్పిస్తున్నాయి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చి.. టోటల్ ప్రాజెక్టును మరోసారి సాగర్ చంద్ర చేతిలో పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. భీమ్లా నాయక్ మూవీ తో సాగర్ ..పవన్ , త్రివిక్రమ్ లకు బాగా దగ్గరయ్యాడు. సెట్ లో కూడా అందరితో మంచిగా ఉండడం..పవన్ వంటి అగ్ర హీరోను డైరెక్ట్ చేస్తున్నానే ఫీలింగ్ లేకుండా చక్కగా ఉండడం త్రివిక్రమ్ కు బాగా నచ్చిందట. అందుకే వినోదాయ సిత్తం రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ సాగర్ కే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

- Advertisement -

ప్రస్తుతం పవన్ చేతిలో ఒకటి రెండు కాదు దాదాపు నాల్గు , ఐదు చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతాయో..మరోపక్క 2024 లో ఎన్నికలు ఉండడం తో వచ్చే ఏడాది నుండి పవన్ రాజకీయాల్లో బిజీ అవుతారు..మరి భీమ్లా కాంబో నిజంగానే మరోసారి సెట్స్ పైకి వస్తుందా అనేది ఆలోచించాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All