పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని సినిమాను చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ సినిమా ఫలితంతో అటు ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇక, రెండో రోజూ హౌస్ఫుల్ బోర్డులతో సినిమా నడుస్తోంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
భీమ్లా చిత్రంలో అన్ని పాటలు ఆడియన్స్ ను అలరించాయి. వాటిలో ‘అంత ఇష్టం’ అని పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. గీయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు. పవన్ కళ్యాణ్ – హీరోయిన్ నిత్యా మీనన్ మధ్య సాగిన ఈ సాంగ్ విడుదలైన క్షణాల్లో వైరల్ గా మారింది. అలాంటి పాట ‘భీమ్లా నాయక్’ చిత్రంలో లేకపోవడం అభిమానులు నిరాశ చెందుతున్నారు. అంత మంచి సాంగ్ ను సినిమా నుంచి తొలగించడానికి కారణాలు ఏంటని మేకర్స్ ను ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. నిజంగా రన్ టైం ఎక్కువైనా కారణంగా తీసేస్తే..వారం రోజుల తర్వాతైనా సాంగ్ యాడ్ చేయండి అంటూ కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు యాడ్ చేస్తారో లేదో చూడాలి.