బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం చిత్రం ఈనెల 7న భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంతకుముందు అల్లుడు శీను , స్పీడున్నోడు , జయ జానకి నాయక , సాక్ష్యం చిత్రాల్లో నటించగా అల్లుడు శీను చిత్రం సాయి కి మంచి పేరు తెచ్చింది అలాగే జయ జానకి నాయక చిత్రంతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు ఇక ఈ కవచం తో సాలిడ్ హిట్ కొట్టబోతున్నానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు . అంతేకాదు ఇంతకుముందు ఈ హీరో నటించిన చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి అయితే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కువ కావడంతో అవి కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ గా నిలిచాయి కానీ కవచం మాత్రం రిలీజ్ కి ముందే పది కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకువచ్చిందని అంటున్నాడు సాయి శ్రీనివాస్ .
ఇంతకుముందు చేసిన సినిమాల బడ్జెట్ ఎక్కువ అయితే ఈ కవచం ని మాత్రం తక్కువ బడ్జెట్ లో చేశామని , క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఇక సినిమా పరంగా కూడా సక్సెస్ కొడతా అని అంటున్నాడు . పోలీస్ ఆఫీసర్ గా నటించిన కవచం తప్పకుండా హిట్ అయి తన రేంజ్ ని మరింతగా పెంచుతుందని ఆశాభవం వ్యక్తం చేస్తున్నాడు . ఇద్దరు అందాల ముద్దుగుమ్మ లు కాజల్ అగర్వాల్ , మెహరీన్ లతో బెల్లంకొండ చేసిన రొమాన్స్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట . మొత్తానికి ఈ కుర్ర హీరో కవచం చిత్రంతో సూపర్ హిట్ కొట్టే లాగే ఉన్నాడు .