Homeటాప్ స్టోరీస్ఎన్ని దెబ్బలు తిన్నా ఇక మారడా ఈ హీరో

ఎన్ని దెబ్బలు తిన్నా ఇక మారడా ఈ హీరో

bellamkonda sai srinivas another mistakeబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు , అయితే ఆ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు అందునా అల్లుడు శీను , జయ జానకి నాయక చిత్రాలైతే అవసరానికి మించిన ఖర్చులు పెట్టారు . మొదటి సినిమా అల్లుడు శీను భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ దానికి న్యాయమే జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఎంట్రీ మూవీ అంటే ఇలా ఉండాలి అని చర్చించుకున్నారు , ఇండస్ట్రీ అటెన్షన్ కొట్టేసారు అలాగే మంచి వసూళ్ల ని సాధించింది కూడా .

అయితే ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు డిజాస్టర్ అయ్యింది అది కూడా భారీ సినిమానే ! ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడో సినిమా చేసాడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక అని . ఇక ఈ సినిమా కైతే విపరీతమైన ఖర్చు పెట్టారు 40 కోట్లకు పైగా ఖర్చు పెడితే పది కోట్లు కూడా రాలేదు అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది . అయినప్పటికీ ఆ హీరో కానీ బెల్లంకొండ సురేష్ కానీ మారడం లేదు ఇంకా నెల విడిచి సాము చేస్తూనే ఉన్నారు . తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో . కథ , కథనం కుదిరితే సూపర్ హిట్ లు వస్తాయి కానీ భారీగా డబ్బులు పెడితే రావని ఎప్పుడు తెలుసుకుంటారో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All