నందమూరి బాలకృష్ణకు పాటలంటే అమితమైన ఆసక్తి ఉంది. ఇన్నాళ్లూ కెరీర్ లో ఎక్కువగా పాటలు పాడింది లేదు కానీ పాటలపై మంచి అభిరుచి ఉంది. అందుకే ఆయన ఆల్బమ్స్ ఎప్పుడూ నిరుత్సాహపరచవు. ఇదిలా ఉంటే పైసా వసూల్ సినిమాలో మామ ఏక్ పెగ్ లా అంటూ అభిమానులను అలరించాడు బాలకృష్ణ. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా.
ఇదిలా ఉంటే ఆ మధ్య మేము సైతం ఈవెంట్ లో రెండు పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచడు. బాలయ్య ఎలా పాడాడు అన్న విషయం పక్కనపెడితే అతని ఉత్సాహం అందరికీ నచ్చింది. దాని తర్వాత శివ శంకరీ సాంగ్ ను ఆలపించాడు బాలకృష్ణ. దీనిపై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే అత్యంత కష్టమైన పాటను అటెంప్ట్ చేయడం సంగీత ప్రియులకు నచ్చింది.
ఇప్పుడు మరోసారి బాలకృష్ణ తన గొంతును సవరించుకుంటున్నాడు. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు శ్రీరామ దండకం పాడి వినిపించనున్నాడు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.
#NandamuriBalakrishna sings the holy chant #SriRamaDandakam on the eve of #NTR‘s birth anniversary.
Watch out for it tomorrow at 9:45 AM.
Stay Tuned: https://t.co/oH4JpThnNn#NandamuriTarakaRamaRao @NBKFilms_ pic.twitter.com/icegs7PPLm— NBK FILMS (@NBKFilms_) May 27, 2021