Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ, రవితేజ మధ్య మళ్ళీ వార్ షురూ

బాలకృష్ణ, రవితేజ మధ్య మళ్ళీ వార్ షురూ

బాలకృష్ణ, రవితేజ మధ్య మళ్ళీ వార్ షురూ
బాలకృష్ణ, రవితేజ మధ్య మళ్ళీ వార్ షురూ

నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజ రవితేజ మధ్య ఏదో వివాదం నడిచిందన్నది ఫిల్మ్ సర్కిల్స్ టాక్. వివాదం ఏంటో సరిగ్గా తెలీకపోయినా ఇద్దరి మధ్య గొడవైందని మాత్రం అంటుంటారు. బాలకృష్ణ, మీరా జాస్మిన్ విషయంలో రవితేజను కొట్టాడని కూడా పదేళ్ల క్రితం పుకార్లు షికార్లు చేసాయి. అప్పటినుండి బాక్స్ ఆఫీస్ మధ్య గొడవకి రవితేజ కాలు దువ్వుతుంటాడని అప్పట్లో టాక్ బాగా నడిచింది. అయితే అదంతా కొన్నేళ్ల క్రితం సద్దుమణిగిపోయిన వ్యవహారం. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఎందుకంటే దానికి రీజనింగ్ ఉంది.

మరోసారి రవితేజ, బాలకృష్ణతో వార్ కు సై అంటుండడమే దీనికి కారణం. ప్రస్తుతం రవితేజ చేస్తున్న చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలోని మొదటి పాట ఈ మధ్య విడుదలవగా దానికి విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ ఫామ్ అంత బాగోలేకపోయినా రాజా ది గ్రేట్ తరహాలో మంచి ఎంటర్టైనర్ పడితే వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టమైన విషయమేం కాదన్నది ప్రూవ్ అయింది.

- Advertisement -

కాబట్టి డిస్కో రాజాను మంచి సీజన్ చూసుకుని డిసెంబర్ 20న విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇంతవరకూ బానే ఉంది కానీ అదే రోజున బాలకృష్ణ 105వ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా పేరు అధికారికంగా ప్రకటించలేదు కానీ రూలర్ టైటిల్ బయటకు పొక్కింది. ఈ చిత్రం కూడా అదే రోజున వస్తుండడంతో రవితేజ, బాలకృష్ణ మధ్య వార్ డిస్కషన్ తెరపైకి వచ్చింది.

రవితేజ, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు సంక్రాంతి బరిలో తలపడ్డారు. 2008లో సంక్రాంతికి రవితేజ కృష్ణ, బాలకృష్ణ ఒక్క మగాడు చిత్రాలు విడుదలవ్వగా కృష్ణ సూపర్ హిట్ అయింది. ఒక్క మగాడు డిజాస్టర్ గా మిగిలింది. 2011లో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ పరమవీరచక్ర విడుదలవ్వగా దాని రిజల్ట్ అందరికీ తెల్సిందే. మిరపకాయ్ సూపర్ డూపర్ హిట్ అయింది. పరమవీర చక్ర అతి చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ నేపథ్యంలో మూడో సారి క్రిస్మస్ బరిలో ఇద్దరూ తలపడుతుండడంతో ఎటువంటి ఫలితం వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఈసారి క్రిస్మస్ కు వీరిద్దరే కాకుండా సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగేను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నాడు. మరి ఈ త్రిముఖ పోరులో పైచేయి ఎవరిదో!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All