సరిగ్గా పదహారేళ్ళ క్రితం దర్శకులు వివివినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ” చెన్నకేశవ రెడ్డి ” . నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు కట్ చేస్తే ఆ సినిమా తర్వాత మళ్ళీ బాలయ్య – వినాయక్ ల కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు . 16 సంవత్సరాల తర్వాత బాలయ్య – వినాయక్ కలిసి సినిమా చేయబోతున్నారు .
చెన్నకేశవరెడ్డి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఆ అంచనాలను అందుకోలేదు మరి ఇప్పుడు రూపొందబోయే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా ? సూపర్ హిట్ ఇస్తాడా ? అన్న ఆసక్తి నెలకొంది . ఇటీవలే బాలయ్య తో జై సింహా అనే సినిమాని నిర్మించాడు సి . కళ్యాణ్ కాగా మళ్ళీ మేలో బాలయ్య – వినాయక్ ల కాంబినేషన్ లో మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . మే 27న ఈ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు నిర్మాత ప్రకటించాడు .