క్రాక్ సినిమాతో భీకరమైన హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని. మాస్ మహారాజా రవితేజ వరస ప్లాపుల మధ్య ఉన్న నేపథ్యంలో క్రాక్ తో మ్యాసివ్ కంబ్యాక్ ఇచ్చాడు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో పనిచేయడానికి ఆసక్తి చూపించాడు. ఈ మేరకు స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. లైన్ విన్న బాలయ్య కూడా పాజిటివ్ గా రెస్పొంద్ అయినట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా అనౌన్స్ కాబోతోందని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ విన్న బాలయ్య ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపేసాడట. గోపీచంద్ ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడట.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. బాలయ్య వరస ప్లాపుల మధ్య ఉన్నా కానీ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా భారీ హైప్ నెలకొని ఉంది. మే 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.