![balakrishna condolences to director sarath](https://telugu.tollywood.net/wp-content/uploads/2022/04/balakrishna-condolences-to-.jpg)
బాలకృష్ణ తో పెద్దన్నయ్య , వంశానికొక్కడు , సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ శరత్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఈయన ..ఈరోజు ఆరోగ్యం విషమించడం తో తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా..నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఆయన నాకు మంచి ఆప్తుడు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనతో నేను ‘వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు’ సినిమాలు చేశాను. ఈరోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్థపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక శరత్ సినీ కెరీర్లో చేసింది 20 సినిమాలే అయినా అవన్నీ కూడా ఎక్కువగా సుమన్, బాలకృష్ణలతోనే చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో సూపర్ మొగుడు, ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు లాంటి సినిమాలను తెరకెక్కించారు. చివరిగా శ్రీహరి హీరోగా తెరకెక్కిన ఎవడ్రా రౌడీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన మళ్లీ డైరెక్షన్ చేయలేదు. ఇక రేపు ఈయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.