స్టార్ హీరో పవన్కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత `వకీల్సాబ్` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ పిల్మ్ `పింక్` ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో వుంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
ఇదిలా వుండగా ఈ మూవీ అండర్ ప్రొడక్షన్లో వుండగానే మరో రీమేక్ చిత్రాన్ని పవర్స్టార్ పవన్కల్యాణ్ పట్టాలెక్కిస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజు మీనన్ కలిసి నటించిన చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`. సచి దర్శకత్వం వహించిన ఈ మూవీ మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు.
ఈ మూవీ స్టోరీ నచ్చడంతో పవన్కల్యాణ్ ఈ రీమేక్లో నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ ని తెలుగు నేటివికీ అనుగునంగా మార్చేశారు. పూర్తిగా స్క్రిప్ట్ వర్క్ పూర్తవడంతో ఈ చిత్రాన్ని సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. జనవరి 2 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.