కథ, పీఎస్వీ గరుడవేగ, మనసుకునచ్చింది, 24 కిస్సెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ ఆదిత్ భారీ లైనప్నే రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం లోక కల్యాణం, విధి విలాసం, కథ కంచికి మనం ఇంటికి వంటి విభిన్నమైన కథలతో రూపొందుతున్న మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. ఇదిలా వుంటే తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిసింది.
న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ మల్టీమీడియా బ్యానర్పై వరుస చిత్రాల్ని నిర్మిస్తున్న బెక్కెం వేణు గోపాల్ మరో కొత్త తరహా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. విశ్వక్సేన్తో `పాగల్` చిత్రాన్ని గురువారం మొదలుపెట్టిన నిర్మాత బెక్కెం వేణు గోపాల్ త్వరలో అరుణ్ ఆదిత్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి `వేసవి 1999` అనే టైటిల్ని ఫిక్స్ చేశారు.
ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిల్మ్ మేకర్ సోమ్నాథ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇదొక పిరియాడిక్ లవ్ స్టోరీ. ఆర్మీ ఆఫీసర్గా ఇందులో హీరో అరుణ్ ఆదిత్ కనిపిస్తారట. హైదరాబాద్, సంగారెడ్డిల్లో షూట్ చేయున్నారట. ఇప్పటికే మూడు రోజుల పాటు ట్రయల్ షూట్ని కూడా నిర్వహించినట్టు తెలిసింది. నెక్ట్స్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.