తమిళ నటుడు శరత్ కుమార్ ఆయన భార్య నటి రాధిక లపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది . ఓ చెక్ బౌన్స్ కేసులో సైదాపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి . రేడియన్స్ మీడియా సంస్థ నుండి 2 కోట్లు తీసుకున్నారు శరత్ కుమార్ – రాధికా దంపతులు అలాగే వీళ్లకు మరో పార్ట్ నర్ లిస్టిన్ స్టీఫెన్ .
అయితే ఈ ముగ్గురు తీసుకున్న 2 కోట్లకు గాను ఆ తర్వాత చెక్ ఇచ్చారు రేడియన్స్ సంస్థకు . కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది దాంతో శరత్ కుమార్ , రాధిక , లిస్టిన్ స్టీఫెన్ లపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సైదా పేట కోర్టు. తదుపరి విచారణకు జూలై 12 కు వాయిదాపడింది . కోర్టు ఆదేశాలతో అరెస్ట్ శరత్ కుమార్ – రాధిక లను అరెస్ట్ చేస్తారా ? లేక బెయిల్ తెచ్చుకుంటారా ? చూడాలి .
- Advertisement -