ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన గుణ 369 చిత్ర విజయం పై ధీమాగా ఉన్నాడు యువ దర్శకులు అర్జున్ జంధ్యాల . బోయపాటి శ్రీను శిష్యుడైన అర్జున్ జంధ్యాల తొలిసారిగా మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన గుణ 369 ఆగస్టు 2 న విడుదలకు సిద్ధమైంది . ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అర్జున్ జంధ్యాల సినిమా బాగా వచ్చిందని , దర్శకులు బోయపాటి శ్రీను కూడా అలాగే మా నిర్మాతలకు కూడా బాగా నచ్చిందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు .
కార్తికేయ – అనఘా జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లో తీయలేదని , వాస్తవ సంఘటనల ఆధారంగా గుణ 369 చిత్రీకరించామని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసాడు . తదుపరి చిత్రాల కోసం కథలు సిద్ధంగా ఉన్నాయని అయితే గుణ 369 రిజల్ట్ తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఇంటర్వ్యూ కి ముగింపు పలికాడు అర్జున్ జంధ్యాల .