Homeటాప్ స్టోరీస్మూడు స్కోచ్ పుర‌స్కారాలు అందుకున్న ఏపీ సీఐడీ పీవీ సునీల్‌కుమార్

మూడు స్కోచ్ పుర‌స్కారాలు అందుకున్న ఏపీ సీఐడీ పీవీ సునీల్‌కుమార్

మూడు స్కోచ్ పుర‌స్కారాలు అందుకున్న ఏపీ సీఐడీ పీవీ సునీల్‌కుమార్
మూడు స్కోచ్ పుర‌స్కారాలు అందుకున్న ఏపీ సీఐడీ పీవీ సునీల్‌కుమార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేర పరిశోధ‌న విభాగం (ఏపీసీఐడీకి) రెండు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్‌కు ఒక అవార్డును స్కోచ్ సంస్థ ప్ర‌క‌టించింది. శ‌నివారం ఢిల్లీలో జరిగిన కార్య‌క్ర‌మంలో ఈ అవార్డుల్ని ఏపీ సీఐడీ విభాగం ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ అందుకున్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎస్సీ, ఎస్టీ వేధంపుల నిరోధ‌క చ‌ట్టం త‌దిత‌ర చ‌ట్టాల‌పై పోలీసుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ సీఐడీ నిర్వ‌హిస్తున్నఈ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల‌కు గానూ ఈ స్కోచ్ అవార్డులు ల‌భించాయి.

అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ‌క చ‌ట్టంతో పాటు ప‌లు పౌర హ‌క్కులను ప‌ర్య‌వేక్షించే ప్రొటెక్ష‌న్ ఆఫ్ సివిల్ రైట్స్ (పీసీఆర్‌) డాష్ బోర్డు ప‌నితీరుకు మ‌రో అవార్డు ద‌క్కింది. దీనితో పాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌లో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్‌కు మ‌రో స్కోచ్‌ అవార్డు ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవార్డులు అందుకున్న అధికారుల‌కు డీజీపీ గౌత‌మ్ సవాంగ్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఏపీ సీఐడీ విభాగం ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ స్కోచ్ అవార్డులు అందుకున్న సంద‌ర్భంగా `టాలీవుడ్.నెట్‌` మరియు ముర‌ళీ బొమ్మ‌న‌వేని, ముర‌ళీ ర‌వి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All