Homeగాసిప్స్బాలకృష్ణ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు

బాలకృష్ణ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు

ap bjp leaders complaints to governor on balakrishna commentsనందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ధర్మ దీక్ష లో పాల్గొన్న బాలయ్య సహనం కోల్పోయి ప్రధాని మోడీ పై నిప్పులు చెరిగాడు . మోడీ శిఖండి లా వ్యవహరిస్తున్నాడని ముందుగా తన భార్య ని గౌరవించుకోవడం నేర్చుకోవాలని అలాగే తనకంటే పెద్ద వాళ్ళను గౌరవించాలని అద్వానీ ఉదంతాన్ని ఉదహరించారు బాలయ్య .

కొజ్జా లా వ్యవహరిస్తూ ఇక్కడ గెలవాలని ఆలోచిస్తున్నాడని కానీ ఇక్కడ ( ఆంధ్రప్రదేశ్ ) లో ఒక్క సీటు కూడా రాదనీ నిప్పులు కురిపించాడు బాలయ్య . దాంతో ఈరోజు గవర్నర్ విశాఖపట్టణం కు రావడంతో బిజెపి నాయకులు గవర్నర్ తో సమావేశమై బాలయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు . బాలయ్య హిందూపురం శాసన సభ్యుడి గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All