Homeటాప్ స్టోరీస్క‌మ‌ల్ కోసం జేజ‌మ్మ‌ని ఫిక్స్ చేశారా?

క‌మ‌ల్ కోసం జేజ‌మ్మ‌ని ఫిక్స్ చేశారా?

క‌మ‌ల్ కోసం జేజ‌మ్మ‌ని ఫిక్స్ చేశారా?
క‌మ‌ల్ కోసం జేజ‌మ్మ‌ని ఫిక్స్ చేశారా?

క‌మల్‌హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఇండియ‌న్ -2`. శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌ల జ‌రిగిన క్రేన్ యాక్షిడెంట్ కార‌ణంగా ఆగిపోయి మ‌ళ్లీ మొద‌లైంది. తాజాగా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో మ‌ళ్లీ షూటింగ్ ఆపేశారు. ఇదే చిత్రాన్ని తెలుగులో `భార‌తీయుడు 2` పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్  అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా వుంటే క‌మ‌ల్‌హాస‌న్ గ‌త కొన్నేళ్ల క్రితం న‌టించిన చిత్రం `రాఘ‌వ‌న్‌`. గౌత‌మ్ మీన‌న్ రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో తెర‌కెక్కించిన మ‌ర్డ‌ర్ మిస్ట్రీ థ్రిల్ల‌ర్ ఇది. 2006 లో వ‌చ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌ని రూపొందించాల‌ని ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ప్లాన్ చేస్తున్నారు. త‌మిళంలో `వెట్ట‌యాడు విలైయాడు` పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రాఘ‌వ‌న్ పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాష‌ల్లోనూ విజ‌యం సాధించిన ఈ చిత్రానికి త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోంది.

- Advertisement -

చాలా కాలంగా ఈ సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని గౌత‌మ్ మీన‌న్ ప్లాన్ చేశాడు కానీ వ‌ర్కవుట్ కాలేదు.  మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు సీక్వెల్ ప్ర‌య‌త్నాలు క‌లిసి వ‌స్తున్నాయి. అనుష్క ప్ర‌స్తుతం న‌టించిన `నిశ్శ‌బ్దం` ఈ నెల 2న విడుద‌ల కావాల్సి వుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్ ని వాయిదా వేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All