Homeటాప్ స్టోరీస్సరిలేరు బడ్జెట్ పెరిగిందని ఒప్పుకున్న అనిల్ సుంకర

సరిలేరు బడ్జెట్ పెరిగిందని ఒప్పుకున్న అనిల్ సుంకర

సరిలేరు బడ్జెట్ పెరిగిందని ఒప్పుకున్న అనిల్ సుంకర
సరిలేరు బడ్జెట్ పెరిగిందని ఒప్పుకున్న అనిల్ సుంకర

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ మొత్తం ముగించుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా జనవరి 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. అంతకంటే ముందు జనవరి 5న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేయనున్నాడు. అయితే అంతకంటే ముందే సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాత అనిల్ సుంకర ప్రెస్ ను కలిసి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బడ్జెట్ తాము అనుకున్న దానికంటే పెరిగిందని ఒప్పుకున్నాడు. అదే సమయంలో చిత్ర విజయంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసాడు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేసాడు.

నిజానికి సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ పెరిగిందని, అనుకున్న దానికంటే 25 శాతం ఎక్కువ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది సగటు కమర్షియల్ సినిమా కావడంతో, పైగా ఆరు నెలల్లోనే సినిమాను పూర్తి చేసేయడంతో ఈ వార్తలను పెద్ద నమ్మలేదు. కానీ అనిల్ సుంకర మాత్రం బడ్జెట్ పెరిగిందని ఒప్పుకున్నాడు. ఎంత మేర అన్నది చెప్పలేదు. ఈ చిత్రానికి 160 రోజులు వర్కింగ్ డేస్ అయినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే ఆరు నెలల్లో ఎక్కువ భాగం షూట్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఒక కమర్షియల్ చిత్రానికి ఇన్ని రోజులు వర్కింగ్ డేస్ అంటే ఆశ్చర్యకరమే.

- Advertisement -

మహేష్ బాబు చిత్రానికి బడ్జెట్ పెరగడం మాములే. క్వాలిటీ గురించి కష్టపడుతున్నప్పుడు బడ్జెట్ పెరుగుతుందని మహేష్ కూడా ఇదివరకు ఒకసారి చెప్పాడు. అయితే బడ్జెట్ పెరిగినా బిజినెస్ విషయంలో మాత్రం మహేష్ సినిమాకు ఢోకా లేదు. సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అవ్వగా, దానికి మించి బిజినెస్ జరిగింది. దీంతో నిర్మాత హ్యాపీ. మరి డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లు పెట్టి కొనుక్కుని, సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ద్వారా ఎంత లాభపడతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All