బుల్లితెర పై జబర్దస్త్ వచ్చిన తర్వాత బూతు షోలు ఎక్కువయ్యాయి . జోకులు పేరుతో శృతి మించి ద్వంద్వార్ధల పదజాలం ఎక్కువ అవుతున్నాయి . అందులో భాగంగా పటాస్ అనే కార్యక్రమంలో మొదటగా యాంకర్ గా చేయమని శ్యామల ని అడిగారట కానీ ఆ కాన్సెప్ట్ మొత్తం విన్నాక నేను చేయనని అందులో బూతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తప్పుకుందట దాంతో ఆమె స్థానంలో శ్రీముఖి ని తీసుకున్నారట .
పటాస్ షోలో రవి తో పాటు శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది అయితే ఈ షోలో ఎక్కువగా బూతులు మాట్లాడుతూనే ఉంటారు . కొన్నిసార్లు అయితే ఆ మాటలు వినలేమంటే నమ్మండి అంత రోతగా ఉంటాయి డైలాగ్స్ . అయితే యాంకర్ శ్యామల ఆ షో నుండి తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ……. నేను గోదావరి జిల్లా కు చెందిన అమ్మాయిని మా యాసలో మర్యాద తప్పనిసరిగా ఉంటుంది అందుకే ఆ షో తప్పుకున్నానని అంటోంది .