నటసింహం నందమూరి బాలకృష్ణ ని హిందూపురం లో ఓడించడానికి నడుము బిగించింది తెలుగు యాంకర్ శ్వేతా రెడ్డి . పలు ఛానల్ లలో యాంకర్ గా పనిచేసిన శ్వేతా రెడ్డి ఇటీవల ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కే ఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో చేరింది , అంతేకాదు ఏకంగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం సీటు కొట్టేసింది . డాక్టర్ కే ఏ పాల్ శ్వేతా రెడ్డి ని బాలయ్య మీద పోటీ కి నిలబెడుతున్నాడు .
రెడ్డి వర్గానికి చెందిన మహిళని బాలయ్య పై పోటీకి పెడుతున్నామని , బాలయ్య ని ఓడించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో అడుగుపెడుతుందని అంటున్నాడు కే ఏ పాల్ . ఇక యాంకర్ శ్వేతా రెడ్డి కూడా బాలయ్య పై పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తోంది . అయితే బలమైన తెలుగుదేశం పార్టీని , బాలయ్య ఛరిస్మాని ఈ భామ తట్టుకోగలదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే బాలయ్య నియోజకవర్గం లో పెద్దగా అభివృద్ధి చేసింది లేదు అలాగే కార్యకర్తలతో , నాయకులతో సఖ్యత పాటించింది లేదు కాబట్టి ఆ రూపంలో బాలయ్య కు పోటీగా ఎవరు ఉన్నా కాస్త అదృష్టవంతులే !
English Title: Anchor Shwetha reddy contest aganist Balakrishna in hindupuram