బుల్లితెర మీద తన అందాలతో అలరిస్తూ యాంకర్ గా తన ఫాం కొనసాగిస్తున్న అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో అమ్మడు దాక్షాయని పాత్రలో నటిస్తుంది. ఫస్ట్ లుక్ చూస్తేనే పుష్పలో కూడా అనసూయకి మంచి రోల్ దొరికిందని అర్ధమవుతుంది. ఇక లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ ఇంటరాక్షన్ లో డిమాండ్ చేసే పాత్ర వస్తే గుండుతో అయినా నటించడానికి రెడీ అంటుంది.
తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే అనసూయ లేటెస్ట్ గా వారితో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వస్తే గుండుతో కనిపిస్తారా అంటే.. పెద్ద ప్రాజెక్ట్ అయ్యి.. పాత్ర ప్రాధాన్యత ఉంటే కచ్చితంగా గుండుతో నటిస్తానని అన్నది అనసూయ. సినిమాల మీద అనసూయ కమిట్మెంట్ అదిరిపోయిందని ఆడియెన్స్ అంటున్నారు.
ఆల్రెడీ సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెప్పించిన అనసూయ ఈసారి దాక్షాయనిగా తన నట విశ్వరూపం చూపించనుంది. సినిమాలో ఆమెది నెగటివ్ టచ్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.