సామాజిక మాధ్యమం ట్విట్టర్లో యాక్టీవ్గా వుంటున్నారు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్. ఆయనకున్న అభిమానగనం గునంచి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా బిగ్బికి అభిమానులున్నారు. ఇప్పటికీ ఆయనని కలవాలని పరితపిస్తుంటారు. ముంబై వస్తుంటారు. దేశ విదేశాల నుంచి అమితాబ్ దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. దూరం నుంచైనా సరే ఆయనని చూసి వెళ్లాలని వస్తుంటారు.
అలాంటి అభిమానుల కోసం జుహూలోని తన నివాసం `జల్సా`లో ప్రతి ఆదివారం ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ అభిమానులని కలుస్తుంటారు. ఆ రోజు జల్సా ముందు భారీ సంఖ్యలో అభిమానులు చేరి అమితాబ్ చెప్పేమాటలు వింటూ ఆయనని చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంటారు. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ దానిక ఇకరోనా కారణంగా బ్రేక్ పడింది.
ఈ ఆదివారం `జల్సా` ముందుఏ పారిశుద్య కార్మికులు తప్ప ఎవరూ కనిపించకపోవడంతో ఆ దృశ్యాలని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న అమితాబ్ బచ్చన్ `జల్సా` ముందు అభిమానుల సందడి లేదని ఎవరన్నారు. ఇదిగో చూడండి అంటూ జల్సా ముందు పనిచేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ కష్ట కాలంలో సినీ కార్మికుల కోసం అమితాబః బిగ్ బాజర్ కూపన్స్ని అందించారు. బాలీవుడ్ కార్మికులతో పాటు అన్ని భాషల వారికి ఈ కూపన్లని అందించడం విశేషం.
T 3534 – kaun kehta hai Sunday ki well wisher meetings band ho gayi Jalsa gate pe .. ye dekhiye .. !! pic.twitter.com/9jjreZziCO
— Amitabh Bachchan (@SrBachchan) May 17, 2020