Homeటాప్ స్టోరీస్అమితాబ్ కుటుంబంలో విషాదం

అమితాబ్ కుటుంబంలో విషాదం

amitab daughter shwetha bachchan father in law rajan nanda diesబిగ్ బి అమితాబ్ కుటుంబంలో విషాదం నెలకొంది . అమితాబ్ బచ్చన్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ చైర్మన్ రాజన్ నందా నిన్న రాత్రి చనిపోయాడు , ఈ విషయం అమితాబ్ కు తెలిసిన వెంటనే బల్గెరియా నుండి వెంటనే భారత్ కు బయలుదేరాడు . నాగార్జున అతిథి పాత్ర పోషిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ ప్రస్తుతం బల్గెరియా లో షూటింగ్ జరుపుకుంటోంది . ఇటీవలే నాగార్జున తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే . కాగా అమితాబ్ షూటింగ్ లో ఉండగా ఈ విషయం తెలియడంతో వెంటనే షూటింగ్ ని రద్దు చేసుకొని ఇండియాకు బయలుదేరాడు .

అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ కు ఈ రాజన్ నందా మావయ్య . రాజన్ నందా కొడుకు ని శ్వేతా పెళ్లి చేసుకుంది . ఎస్కార్ట్స్ గ్రూప్ కి ఛైర్మన్ గా వ్యవహరిస్తుండగా అమితాబ్ అల్లుడు , శ్వేతా భర్త మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు . తన వియ్యంకుడు చనిపోయిన విషయాన్నీ అమితాబ్ ట్వీట్ చేయడంతో అతడు మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు పలువురు సినీ ప్రముఖులు . అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక అమితాబ్ మళ్ళీ బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు .

- Advertisement -

English Title: amitabh daughter shweta bachchan father in law rajan nanda dies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All