స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఆ చిత్రానికి “అల…. వైకుంఠపురంలో ” అనే టైటిల్ ని ఖరారు చేశారు.
- Advertisement -
టైటిల్ ఖరారుతో పాటుగా లోగో ని కూడా విడుదల చేసారు.
ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టైటిల్ ని అలాగే లోగో ని విడుదల చేసారు చిత్ర బృందం.
అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రలో టబు నటిస్తోంది.
ఇంతకుముందు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ అల ….. వైకుంఠపురంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ చిత్రాన్ని 2020 జనవరిలో విడుదల చేయనున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ , లోగో పట్ల అభిమానులు చాలా సంతోషించడం ఖాయం.
- Advertisement -