వెండితెరపై గత కొన్నేళ్లుగా తనదైన హాస్యంతో ఆకట్టుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో అల్లరి నరేష్. ఏడాదికి నాలుగు నుంచి ఆరు చిత్రాల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన అల్లరి నరేష్ గత కొంత కాలంగా ఎలాంటి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలా? అని డైలమాలో వున్నారు. ఇటీవలే రెండు కొత్త చిత్రాలని మొదలుపెట్టారు కూడా.
రెండు చిత్రాల్లో ఒకటి `బంగారు బుల్లోడు` పేనుతో రూపొందుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ `నాంది` పేరుతో తెరకెక్కుతున్న చిత్రంతోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. వేగేశ్న సతీష్(దర్శకుడు కాదు) నిర్మిస్తున్నారు.
ఇదిలా వుంటే కరోనా వైరస్ కారణంగా కేంద్రం దేశం మొత్తం లాక్ డౌన్ని ప్రకటించింది. దీని కారణంగా చాలా మంది ఉపాదిని కోల్పోతున్నారు. సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అల్లరి నరేష్, `నాంది` చిత్ర నిర్మాత వేగేశ్న సతీష్ తమ సినిమా కోసం పనిచేస్తున్న 50 మందికి తల 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చారు. మనిషిగా కష్టం వచ్చినప్పుడు అందరం అందరి కోసం నిలబడకవచ్చు. కానీ ప్రతీ ఒక్కరు పక్కవారి కోసం ఎంతో కొంత చెయ్యగలం` అని అల్లరి నరేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.