యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. గతంలో సంక్రాంతి రిలీజ్ చేస్తామని భారీ ఎత్తున ప్రమోషన్ చేశారు.
కేవలం ప్రమోషన్ కే రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో సినిమా వాయిదా పడడంతో వారు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇక ఇప్పుడు ఆ రేంజ్ లో ఖర్చు పెట్టకుండా ఉన్నంత లో కాస్త తక్కువగా ఖర్చు చేసి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకరావాలని నిర్మాత ఆలోచిస్తున్నాడట. అయితే ఈసారి ప్రమోషన్ కు అలియా దూరం గా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇతర సినిమాల షూటింగ్ లతో బిజీ గా ఉండడమే. ఇది కూడా నిర్మాతకు కాస్త కలిసొచ్చేదే అంటున్నారు. ఎందుకంటే అలియా తో ప్రమోషన్ అంటే అది భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటున్నారు.
గత రిలీజ్ టైములో అలియా ప్రమోషన్లకు 15 రోజులు కేటాయించింది. ఆ 15 రోజుల్లో అలియా ఖర్చు 3 కోట్లకుపైగానే అని అంటున్నారు. అలియా, తన స్టాఫ్కి ప్రత్యేక విమానాలు, హోటెల్ రూమ్లు… వీటికి అక్షరాలా మూడు కోట్లు అయ్యాయట. ఈసారీ కూడా అంతే అవుతుంది. అందుకే అలియా ప్రమోషన్లలో ఉండడం వల్ల ఆర్.ఆర్.ఆర్కి ప్రత్యేకమైన గుర్తింపు, మైలేజీ ఏం ఉండదు.కాబట్టి.. అలియా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాత తో పాటు చిత్ర యూనిట్ భావిస్తున్నారట. మరి ముంబై లోనైనా వస్తుందేమో చూడాలి.