బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోటి రూపాయల విరాళం ప్రకటించాడు పోనీ తుఫాన్ తో అతలాకుతలం అయిన ఒడిశా కు . పోనీ తుఫాన్ తీవ్ర భీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే . దాంతో తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు అక్షయ్ కుమార్ . ముఖ్యమంత్రి సహాయనిధి కి తనవంతు విరాళంగా కోటి రూపాయలను అందించాడు .
- Advertisement -
ఇంతకుముందు కూడా పలు విపత్తుల సమయంలో అక్షయ్ కుమార్ త్వరగా స్పందించి మిగతా సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచాడు . ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో తక్షణం స్పందించే గుణం కలిగిన వ్యక్తి ఈ హీరో . తెరమీదే హీరోయిజం చూపించకుండా నిజ జీవితంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అక్షయ్ కుమార్ .
- Advertisement -