సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సాంకేతికత కారణంగా ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామంగా మారిపోయింది. ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో బయటికి వచ్చేస్తోంది. దీని వల్ల మంచి ఎంతో కొంత వున్నా చెడే అత్యధిక భాగం వుంటోంది. ఇంతకు ముందు సెలబ్రిటీలని, పొలిటికల్ లీడర్స్ని నేరుగా కలవాలన్నా, అభిప్రాయాల్ని చెప్పాలన్నా అంత సులభంగా వుండేది కాదు. కానీ సోషల్ మీడియా వల్ల నేరుగా వారికే కంప్లైంట్ చేసే రోజులొచ్చాయి.
దీని వల్ల రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఈ విషయంలో స్టార్ హీరోయిన్ భయాందోళనకు గురవుతోందట. ఇటీవలే ఆమె నెట్ఫ్లిక్స్లో `సోషల్ డైలమా` అనే డాక్యుమెంటరీని చూసిందట. అప్పటి నుంచి తనకు భయమేస్తోందని వాపోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా వ్యక్తుల జీవితాలని డేటా అనే అంశం శాసిస్తోందని, దాని కారణంగా వ్యక్తులకు ప్రైవేట్ లైఫ్ అన్నదే లేకుండా పోయిందని ఆందోళనకు గురవుతోంది.
సోషల్ మీడియా కారణంగా ప్రైవసీ అన్నది లేకుండా పోయిందని, చాలా మంది వ్యక్తిగత అకౌంట్లని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఫోన్ నంబర్ బయటికి వచ్చిందా? వారి జీవితమే మారిపోయేలా టెక్నాలజీ శాసించే స్థితికి చేరుకున్నామని భయపడుతోంది.