అజిత్ నటించిన వలిమై మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అభిమానులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన కోయంబత్తూరులోని గంగ వల్లి మల్టీప్లెక్స్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..అజిత్ హీరోగా హెచ్ వినోథ్ తెరకెక్కించిన చిత్రం ‘వలిమై’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ఎక్స్ ఫేమ్ కార్తికేయ విలన్గా నటించడం విశేషం. హూమా ఖురేషీ హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేయగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించాడు. భారీ అంచనాల మధ్య ఈరోజు తమిళ్ , తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా రిలీజ్ సంబరాల్లో అభిమానులు ఉండగా.. కోయంబత్తూరులోని గంగ వల్లి మల్టీప్లెక్స్లో ముగ్గురు దుండగులు థియేటర్లో పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అభిమానులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ వచ్చి సదరు దుండగులు బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే వారిని పట్టుకోవడానికి అజిత్ అభిమానులు ప్రయత్నించారు. కానీ దుండగులు తప్పించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణను ప్రారంభించారు.