Homeటాప్ స్టోరీస్అజ్ఞాతవాసి బయ్యర్లని ఆదుకుంటారట

అజ్ఞాతవాసి బయ్యర్లని ఆదుకుంటారట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే , ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఏకంగా 60 శాతం నుండి 70 శాతం వరకు నష్టపోతున్నారు దాంతో వాళ్ళని ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నారట ఆ చిత్ర యూనిట్ అయితే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం కుదరదు కానీ 15 శాతం నుండి 20 శాతం వరకు వెనక్కి ఇవ్వడానికి సూత్ర ప్రాయంగా ఒప్పుకున్నారట ఆమేరకు దర్శకులు త్రివిక్రమ్ కూడా తన పారితోషికంలో కొంత భాగం నిర్మాత రాధాకృష్ణ కు ఇస్తున్నాడట .

అజ్ఞాతవాసి చిత్రాన్ని కొన్న ప్రతీ బయ్యర్ తీవ్రంగా నష్టపోయారు ఇక నైజాం ఏరియాలో రిలీజ్ చేసిన దిల్ రాజు అయితే ఏకంగా 20 కోట్ల నష్టాన్ని చవిచూశాడు . దాంతో ఈసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఒప్పందం ముందుకు తెచ్చాడట దిల్ రాజు . పవన్ కనుక డేట్స్ ఇస్తే నా నష్టాన్ని పూడ్చుకునే వీలుందని అన్నాడట మరి పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకుంటాడో ? లేదో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All