సాహో మూవీ తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో రాధే శ్యామ్ మూవీ ఒకటి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ డైరెక్ట్ చేయగా యూవీ క్రియేషన్స్ , గోపి మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇదిలా ఉంటె ప్రభాస్ రాముడిగా నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్.
పౌరాణిక చిత్రంగా రాబోతున్న ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్, లక్ష్మయుడిగా సన్నీ సింగ్ వంటి వారు నటిస్తుండగా..ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2022న రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా 2023 జనవరి 12న 3డీలో విడుదల చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే చిత్రీకరణ పూర్తి చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. “ఆదిపురుష్”లో ఎక్కువగా గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఉండడంతో విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉండడం తో సినిమా ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
#Adipurush
Worldwide Theatrical Release in 3D on 12th Jan 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 #ShivChanana #TSeries pic.twitter.com/ozGRZPRiQR— Om Raut (@omraut) March 1, 2022