ప్రభాస్ – ఓం రనౌత్ కలయికలో వచ్చిన ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. భారీ అంచనాల నడుమ గత వారం విడుదలైన ఈ మూవీ..మొదటి రోజు మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లు ఎవరు ఊహించని విధంగా పడిపోతున్నాయి.
మొదటి మూడు రోజుల్లో ఏకంగా రూ. 340 కోట్లు రాబట్టిన ఆదిపురుష్ సినిమాకు నాలుగు రోజు కేవలం రూ. 35 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఐదోరోజు దారుణంగా కేవలం రూ. 10.8 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం. ఇప్పటివరకు గ్రాస్ తో కలిపి చూసుకుంటే.. మొత్తం రూ.400 కోట్ల మార్క్ను దాటేసినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆదిపురుష్ సినిమా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 5 వ రోజు వసూళ్లు చూస్తే..
నైజాం 34.31 కోట్లు
సీడెడ్ 10.17 కోట్లు
ఉత్తరాంధ్ర 9.03 కోట్లు
ఈస్ట్ దోదావారి 5.35 కోట్లు
వెస్ట్ గోదావరి 4.35 కోట్లు
గుంటూరు 6.23 కోట్లు
కృష్ణా 4.16 కోట్లు
నెల్లూరు 2.10 కోట్లుగా నమోదయ్యాయి.