తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నటి శోభన. సినిమాల్లో మంచి క్రేజ్ వున్న దశలోనే ఆమె నటనకు గుడ్ బై చెప్పారు. తెలుగులో నటించడమే మానేశారు. అప్పుడప్పుడు ఆబ్లిగేషన్ మీద మలయాళ చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించి నిర్మించిన `వారానే అవశ్యముడ్` చిత్రంలో నటించి ఆశ్చర్యపరిచారు.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నా తనకు ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్తో దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా తన అభిమానులకు అందుబాటులో వుంటున్న శోభన లాక్డౌన్ వేళ అభిమానులతో టచ్లో వుంటోంది. ఇదిలా వుంటే ఆమె అకౌంట్ని హ్యాక్ చేశారని తెలిసింది.
సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని శోభన వ్యక్తం చేశారు. తన ఫేస్ బుక్ని హ్యాక్ చేశారని, ఈ విషయాన్ని పైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని, త్వరలోనే తన పేజీని తిరిగి పొందుతానని వెల్లడించింది.
View this post on Instagram
To my Instagram followers!! It will be great if you can share the message Thanks shobana