![Actress kalyani became a director Actress kalyani became a director](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/03/Actress-kalyani-became-a-director.jpg)
డా. రాజశేఖర్ నటించిన `శేషు` చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది కల్యాణి. ఆ తరువాత చాలా చిత్రాల్లో హీరోయిన్గా, వదినగా, కీలకమైన పాత్రల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్గా నటించి ఆకట్టుకున్న కల్యాణి తాజాగా కొత్త అవతారం ఎత్తుతోంది. ఎన్నేళ్ల అనుభవంతో తనే నిర్మాతగా, దర్శకురాలిగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
కే2కే బ్యానర్పై కల్యాణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. చేతన్ చీను హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్, ఫస్ట్లుక్ గ్లిప్స్ని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. నటి కల్యాణి ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా మారి తనపేరుని కావేరి కల్యాణిగా మార్చుకుంది.
సినిమాలో సిద్ధ, సుహాసిని, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కొంత భాగం ఇప్పటికే ఓ దర్శకుడు పూర్తి చేశాడని, అతన్ని తప్పించి కల్యాణీ తానే దర్శకురాలిగా మారి ఈ చిత్రాన్ని రూపొందిస్తోందని ప్రయరం జరుగుతోంది.