Homeటాప్ స్టోరీస్వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

actor vizag prasad passed awayసీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ (75 ) ఈరోజు తెల్లవారుఝామున మరణించాడు . తెలుగు సినిమాల్లో పలు చిత్రాల్లో నటించిన వైజాగ్ ప్రసాద్ మృతి టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైజాగ్ ప్రసాద్ ఇంట్లో కాలు జారడంతో గాయాలయ్యాయి . ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు . బాలకృష్ణ హీరోగా నటించిన ” బాబాయ్ – అబ్బాయ్ ” చిత్రం వైజాగ్ ప్రసాద్ తొలిచిత్రం . జంధ్యాల వైజాగ్ ప్రసాద్ ని తెలుగు తెరకు నటుడిగా పరిచయం చేసాడు .

ఆ తర్వాత తెలుగులో చాలా బిజీ అయ్యాడు వైజాగ్ ప్రసాద్ . విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించాడు . వెండితెర మీదే కాదు బుల్లితెర పై కూడా పలు సీరియల్ లలో నటించాడు. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు . వైజాగ్ ప్రసాద్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు . వైజాగ్ ప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేసారు .

- Advertisement -

English Title: actor vizag prasad passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All