తెలుగు సినిమా నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. బీపీ డౌన్ కావడంతో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగ వుందని, భయపడాల్సిన పనేమీ లేదని డాక్టర్లు వెల్లడించినట్టు తెలిసింది. డాక్టర్ల పర్యవేక్షణలో వున్న ఆయనకు గురువారం స్టంట్స్ వేయనున్నారని తెలిసింది.
సీనియర్ నటులు గొళ్లపూడి రాసిన `కళ్లు` అనే నాటిక ఆధారంగా రూపొందిన `కళ్లు` చిత్రంతో హీరోగా శివాజీరాజా సినీ ప్రస్థానం మొదలైంది. హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారాయన. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని దక్కించుకున్న ఆయనకు ఆ తరువాత మూడు నంది పురస్కారాలు లభించాయి.
సినిఆలే కాక పలు టీవీ సీరియల్స్లోనూ ఆయన నటించారు. గుణ్ణం గంగరాజు నిర్మించిన అమృతంలో అమృతం పాత్రలో నటించారు. ఆ తరువాత అమృతం ఆలస్యం విషం, సంబరాల రాంబాబు వంటి సీరియల్స్లోనూ నటించారు.